రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
-ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ
చారకొండ, జూన్ 30(ప్రజాక్షేత్రం): రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యే యమని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో ఆదివారం పీఏసీఎస్ చైర్మన్ జెల్ల గురువయ్యగౌడ్ అధ్యక్షతన మహాజన సభ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ రైతులకు పె ట్టుబడి సాయంగా రైతు భరోసా పథకం అర్హులైన లబ్ధి దారులకు అందించేందుకు ప్రభుత్వం రైతుల అభిప్రా య సేకరణ చేపట్టిందని అన్నారు. ప్రభుత్వం నిర్ధేశించి న లక్ష్యం మేరకు ఆగస్టు 15 లోపే రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. రైతు భరోసా పథకం అమలుపై రైతులు తమ సలహాలు, సూచనలను ఎమ్మెల్యే వంశీకృష్ణకు వివరించారు. అనం తరం ఎమ్మెల్యే వంశీకృష్ణకు పీఏసీఎస్ చైర్మన్ జెల్ల గురు వయ్యగౌడ్, డైరక్టర్లు ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృ ష్ణను శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. జిల్లా సహకార శాఖ అధికారి రఘునందన్రావు, డివిజ న్ అసిస్టెంట్ రిజిస్ర్టార్ భాగ్యమ్మ, పీఏసీఎస్ సీవో వెంక టయ్య, పీఏసీఎస్ డైరక్టర్లు జగన్మోహన్, కొండలయ్య గౌడ్, పాండు, రాజయ్య, పీఏసీఎస్ సిబ్బంది భీమయ్య గౌడ్, ఏఈవోలు వంశీ, రేణుక, అచ్చంపేట బ్లాక్ కాం గ్రెస్ అధ్యక్షుడు గుండె వెంకట్గౌడ్, కాంగ్రెస్ పార్టీ మం డల అధ్యక్షుడు జమ్మికింది బలరాంగౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రె సిడెంట్ పానుగంటి అంజయ్య, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గణేష్ గౌడ్, ఎన్ఎస్ యూఐ మండల అధ్యక్షుడు గోరటి శివ, మాజీ జడ్పీటీసీ భీముడు నాయక్, జెల్ల కృష్ణయ్యగౌడ్, చంద్రశేఖర్, అశోక్ గౌడ్, పాండుగౌడ్, జేసీబీ వెంకటయ్య గౌడ్, గుండె శివగౌడ్, గజ్జే కొండల్గౌడ్, బాడిగ జనార్ధన్గౌడ్, శ్రీపతిరావు, జేపాల్, సహదేవ్, ధశరథం, ఆరేళ్ల పర్వ తాలుగౌడ్, పల్చ వెంకటయ్యగౌడ్, ప్రశాంత్నాయక్, కుకుడాల శ్రీను, నర్సింహరెడ్డి, రత్నా రెడ్డి, వెంకట్రెడ్డి, బిందాస్నాయక్, లక్ష్మయ్య, రైతులు పాల్గొన్నారు.
*పండించే ప్రతీ ఎకరాకు రైతు భరోసా అందిస్తాం*
అచ్చంపేటటౌన్: పండించే ప్రతీ ఎకరాకు రైతు భరోసా అందిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నా రు. ఆదివారం పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహ కార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాజన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గతంలో గుట్టలకు, బీడు భూములకు, రోడ్లకు రైతు బంధు ఇచ్చేవారని కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన రైతులకు పంటలు పండే భూములకు మాత్రమే రైతు భరోసా అందిస్తామన్నారు. రైతు భరోసా పథకంలో రైతుల భాగస్వామ్యం ఉంటుం దని వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి చర్చించడం జరుగుతుందన్నారు. రైతుల అభ్యర్థన మేరకే రైతు భరోసా అందజేయడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలకు ప్రజా పాలన అందించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ సమీవేశంలో పాల్గొన్నారు. సింగిల్విండో చైర్మన్ మం దాడి రాజిరెడ్డి, జడ్పీటీసీ మంత్రియ నాయక్, డైరెక్టర్లు, కౌన్సిలర్లు గౌరీశంకర్, నాయకులు రామనాథం, కార్యక ర్తలు తదితరులు పాల్గొన్నారు.
