గోపులారం గణపయ్యకు ఘనంగా పూజలు
శంకర్ పల్లి సెప్టెంబర్ 21(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండల పరిధి గోపులారం గ్రామంలో మాజీ సర్పంచ్ పొడవు శ్రీనివాస్ సామయ్య ఆధ్వర్యంలో కొలువుదీరిన బొజ్జ గణపయ్య నవరాత్రి వేడుకలు ఘనంగానిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా గోపులారం గణేష్ యూత్ సభ్యులు కలిసి పూజలు జరిపించారు. పూజా కార్యక్రమంలో విష్ణువర్ధన్ గొంగుపల్లి ,శ్రీపాల్ బజరంగ్దళ్ పి.రమేష్ , ఎన్ రాజు, సి.చిన్న ,టి.వెంకటేష్ ,టి. రాజు నవీన్ కాయ్,బి.రమేష్, సి.శ్రీకాంత్ టి.మల్లేష్ గ్రామస్తులు,మహిళా, భక్తులు, యువకులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.